ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
శివనగర్కు చెందిన 300మంది యువకులు టీఆర్ఎస్లో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
ఖిలావరంగల్, ఏప్రిల్ 19 : వరంగల్ శివనగర్ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం శివనగర్కు చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్, టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాశ్, పగడాల సతీశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే శివనగర్ పద్మశాలి భవనంలో కాంగ్రెస్ టీపీసీసీ కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్తోపాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన 35వ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.139కోట్లతో శివనగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. ఈ ప్రాంత యువత, క్రీడాకారులు, వాకర్స్కు కోటలో ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని కొనుగోలు చేసి ఓపెన్ స్టేడియంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.350 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించామన్నారు. యువతకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. కార్యక్రమంలో వాసవీ గణపతి సేవా సమితి అధ్యక్షుడు ఎర్ర ప్రకాశం, బద్రకం ఏకాం తం, మురళి, పాండురంగం, సతీశ్, శ్రీనివాస్, రామారావు, గణేశ్, సదాశివుడు, పరమేశ్వర సంపత్, సాంబయ్య, కవిత, వెన్నెల, కలమ్మ, భద్రమ్మ, రాజు, టీఆర్ఎస్ నాయకులు పెంచాల కుమారస్వామి, కర్నాల సత్యం, మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత