దోహా: ఖతార్లోని కీలకమైన సహజవాయువు కేంద్రం వద్ద ఆదివారం రాత్రి భారీ పేలుడు(Qatar Explosion) ఘటన జరిగింది. ఆ క్షేత్రంపై ఇటీవల ఇరాన్ బాంబు దాడి చేసింది. అయితే ఆ కేంద్రంలో మళ్లీ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు వర్కర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 54 మంది గాయపడ్డారు. మరో 18 మంది మిస్సింగ్లో ఉన్నట్లు తెలిసింది. రాస్ లాఫన్ పారిశ్రామిక వాడలో పేలుడు ఘటన సంభవించింది. ఆ ఘటన వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లో మరింత ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. సహజవాయువుల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ఖతార్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో.. అయితే ఇటీవల ఖతార్ తన ఉత్పత్తిని తగ్గించుకున్నది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఎగుమతి టర్మినల్ను పునర్ ప్రారంభించాలని ఖతార్ భావించారు. అయితే ఆదివారం పని జరుగుతున్న సమయంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన బార్జన్ గ్యాస్ సప్లై కేంద్రంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏ మేరకు నష్టం జరిగిందో ఇంకా అధికారులు అంచనా వేయలేదు.
బార్జన్ ప్లాంట్లో ప్రతి రోజు సుమారు 1.4 బిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ను అమ్మే సామర్థ్యం ఉన్నది. రాస్ లాఫన్ పారిశ్రామిక వాడపై గత మార్చిలో ఓ ఇరాన్ మిస్సైల్ ఢీకొన్నది.దీంతో ఖతార్ అక్కడ ఉత్పత్తి ఆపేసింది.