ధర్మసాగర్, నవంబర్ 24 : ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫైరింగ్ రేంజ్ను గురువారం సీపీ తరుణ్జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జక్కులొద్దిలోని నాల్గో బెటాలియన్కు చెందిన ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేసేవారని అన్నారు.
వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ప్రత్యేకంగా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ముప్పారం గ్రామ శివారులో పోలీస్ శాఖకు చెందిన భూమిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని నిర్మాణానికి కృషి చేసిన అధికారులు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, సంజీవ్, సురేశ్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ రమేశ్, ఎస్సైలు పాల్గొన్నారు.