కరీమాబాద్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆటోడ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అండగా నిలిచారు. గురువారం పెరుకవాడలోని ఆయన నివాసంలో మృతుడి కుటుంబానికి రూ. 25వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తానన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొల్లం సంజీవ్, నాగరాజు, మహేష్, రాజేందర్, కుమార్, నరేష్, రాకేష్, శివ, కిషోర్, దేవరాజ్, నబీ తదితరులు పాల్గొన్నారు. 32వ డివిజన్లోని గాయత్రినగర్ కాలనీలో నిర్మించనున్న పోచమ్మ, మైసమ్మ ఆలయాలకు 25 వేల రూపాయల విరాళం అందజేశారు.