రాయపర్తి : మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల సంయు క్త నిర్వాహణలో ఏర్పాటు చేసిన వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనున్న కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోది వెనుకకు తీసుకోవడంపై కర్షక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెంట్లో ఇబ్బందులను తొలగించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న సంకల్పంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అండ్రెడ్డి యాదమ్మ, జడ్పీటీసీ రంగుకుమార్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పూస మధు, తదితరులు పాల్గొన్నారు.