హనుమకొండ, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉమ్మడి జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో వరంగల్ లోక్సభ అభ్యర్థి మారపెల్లి సుధీర్కుమార్తో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి సూచించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాసర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య ఉన్నారు.