హనుమకొండ చౌరస్తా, మార్చి 7 : అక్టోబర్ 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్’ నిర్వహించారు. ఇందులో రాష్ట్రస్థాయిలో వరంగల్ జిల్లాకు మూడో స్థానం దక్కింది. గురువారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళా భవన్లో ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా ఆర్ఎం శ్రీలత, డిప్యూటీ ఆర్ఎంలు భానుకిరణ్, మాధవరావు, మోహన్రావు, డీఎంలు వెంకటేశం, సురేశ్, ధరమ్సింగ్, రవిచంద్ర, జ్యోత్స్న, ప్రసూనలక్ష్మి, లక్ష్మీనారాయణ, పరిమల, డీఎం శివప్రసాద్కు రూ.50 వేల నగ దు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.