నర్సంపేట, ఫిబ్రవరి 27 : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి సేవాలాల్ శోభాయాత్ర కనుల పండువగా సాగింది. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. లంబాడీ గిరిజనులకు గతంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, ఆ మేరకు తండాలను అభివృద్ధి చేస్తున్నామన్నా రు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. నర్సంపేటలో రూ.63 లక్షలతో బంజారా భవన్ నిర్మిస్తామని తెలిపారు. రా ష్ట్రంలో సుమారు 40 లక్షల మంది బంజారాలు ఉన్నారన్నా రు. వారి ఆరాధ్యదైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, బానోత్ సంగులాల్, ఎంపీపీలు బానోత్ విజేందర్, జాటోత్ రమేశ్ నాయక్, జడ్పీటీసీ పత్తినాయక్, గిరిజన సంఘం నాయకులు ఆంగోత్ భద్రయ్య, డాక్టర్ ఉదయ్సింగ్, తేజావత్ వాసునాయక్, జేత్రాం నాయక్, జగన్ నాయక్, వీరన్న, మోహన్, ఉషా, పద్మాబాయి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్ : విద్యార్థి దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. లక్నేపల్లి బాలాజీ టెక్నో పాఠశాలలో పెండెం భాస్కర్ అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక చెకుముకి సంబురాలు నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ జీవితం నుంచి సైన్స్ను వేరుచేసి చూడలేమని, మూఢ నమ్మకాలను పారదోలాలన్నారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుక్కున్నప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్ కథల రూపంలో శాస్త్రీయ విషయాలను తెలియజేశారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మకతను ఉపయోగించుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం చెకుముకి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నర్సంపేట ముక్కంటి చిట్ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ కత్తి హరీశ్ స్పాన్సర్ చేసిన షీల్డ్లను బహూకరించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, డాక్టర్ జయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, అధ్యాపకులు సత్యనారాయణ, మోతె ఇంద్రసేనారెడ్డి, సాగర్, మాధవి, రాయబోస్, యాకయ్య పాల్గొన్నారు.
చెన్నారావుపేట : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షాల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన 16 మంది యువకు లు, వారి కుటుంబాలు టీఆర్ఎస్ మండల నాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో పార్టీలో చేరారు. ఫ్రెండ్స్ యూ త్ అధ్యక్షుడు సింగిరెడ్డి అనిల్, బారపాక నవీన్, మాంకాళి నర్సయ్య, ఆకులపల్లి సుదర్శన్, జంగిలి రాజేశ్, జంగిలి సతీశ్, అందె లింగమూర్తి, పసునూరి రఘు, జంగిలి ప్రదీప్, జంగిలి అజయ్, బొమ్మకంటి సాగర్, మందుల సాగర్, జంగిలి రమేశ్కు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.