నర్సంపేట/దుగ్గొండి/ఖిలావరంగల్, సెప్టెంబర్ 9: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నర్సంపేటలో ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వర్షం కురిసింది.
దుగ్గొండి మండలవ్యాప్తంగా రహదారులు, అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. పంట చేలల్లో నీరు నిలిచింది. వరంగల్ అండర్ రైల్వేగేటు ప్రాంతంలో మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. శివనగర్లోని ప్రధాన డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.