కరీమాబాద్/గీసుగొండ/కాశీబుగ్గ, ఆగస్టు 17: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో అండర్రైల్వేగేట్ 32వ డివిజన్లో బోనాలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతమంతా భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. కార్పొరేటర్ పల్లం పద్మ బోనంతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురంలో పోచమ్మతల్లి బోనాల వేడుకలు నిర్వహించారు. కొమ్మాల సర్పంచ్ వీరాటి కవిత, విశ్వనాథపురం సర్పంచ్ అంకతీ నాగేశ్వర్రావు, ఉపసర్పంచ్లు బాలోజు నాగయ్య, దునికి కొమురయ్య పాల్గొన్నారు.
కాశీబుగ్గ 14వ డివిజన్ ఎనుమాముల, బాలాజీనగర్లో పోచ్చమ్మతల్లికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. 3వ డివిజన్ పైడిపల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘం పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ జన్ను షీభారాణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కసివోజ్జల పూర్ణచందర్, నాయకులు జన్ను అనిల్, రాజయ్య, ఇ ట్యాల సతీశ్, లింగం సంపత్, సాంబమూర్తి, హరికృష్ణ, మంతుర్తి కుమార్యాదవ్, గజ్టెల చంద్ర య్య, తిరుపతి, కృష్ణ పాల్గొన్నారు. అలాగే, ఆరెపల్లిలోనూ పోచ్చమ్మ బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.