వరంగల్ చౌరస్తా/హసన్పర్తి/స్టేషన్ఘన్పూర్/హనుమకొండ సిటీ, ఆగస్టు 17: రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలుపుతున్న వారు మానవరూపంలో ఉన్న దేవుళ్లతో సమానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎంజీఎం దవాఖానలో, హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, స్టేషన్ఘన్పూర్లో ప్రభుత్వ దవాఖానలో, హనుమకొండ డీఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలను ఆయన ప్రా రంభించారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ గోపి హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరానికి తెలియజేయడం, దేశంపై వారికి గౌరవాన్ని పెంచడం కోసం ప్రభుత్వం 17 రోజులు వజ్రోత్సవాలు నిర్వ హిస్తోందన్నారు. అందులో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయడం, సామూహిక గీతాలాపన వంటి కార్యక్రమాలతో దేశ ఐక్యతను పెంపొందింస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా యువతను భాగస్వామ్యం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపుతో రక్తదాన శిబిరాలకు యువత పెద్దఎత్తున తరలివస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వజ్రోత్సవాల్లో పాల్గొనకుండా ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారు తమ తప్పులను తెలుసుకొని మసులుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేసి దేశభక్తిని చాటారని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
మిషన్ భగీరథ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స, కుడా చైర్మన్ సుందర్రాజ్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంవో మురళి, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ ఛీప్ జీ కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాసరావు, మల్లేశం, నరేందర్రెడ్డి, జడ్పీచైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్కుమార్, ఆర్డీవో వాసుచంద్ర, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రాంకిషన్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సిటీ అధ్యక్షుడు వెలిశాల రాజు, డీపీఆర్వో లక్ష్మణ్, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, జిల్లా వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు, డీఎంహెచ్వో మహేందర్, జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, సర్పంచ్ తాటికొండ సురేశ్, సూపరింటెండెంట్ కృష్ణ, ఎంపీవో సుధీర్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో సుధీర్కుమార్, మెడికల్ ఆఫీసర్ శ్రీవాణి, రవిరాథోడ్, ప్రసన్నకృష్ణ, సంధ్య, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత తదితరులు పాల్గొన్నారు.