చారిత్ర నగరానికి తలమానికమైన భద్రకాళీ బండ్ నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు కుడా నిర్ణయించింది. తొలి దశ మూడేండ్ల ప్రాతిపదికన ఏజెన్సీని ఎంపిక చేసేందుకు టెండరు ప్రక్రియను ప్రారంభించింది. బండ్ నిర్వహణకు ఎంపికయ్యే ఏజెన్సీ ప్రతి నెలా కనీసం రూ.4.80 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. బండ్ ఆవరణలో పర్యాటకులకు మెరుగైన వసతులను కల్పించాలి. కాగా, మొదటి దశలో పూర్తయిన భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చరల్ పార్కును మున్సిపల్ మంత్రి కే తారకరామారావు గత ఏడాది ఏప్రిల్ 12న ప్రారంభించారు. అదేరోజు రూ.65 కోట్లతో రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగరానికి పర్యాటక హంగులు తెచ్చిన భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చరల్ పార్కు (భద్రకాళీ బండ్) నిర్వహణ కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. బండ్ ప్రాంతంలో పారి శుధ్య నిర్వహణ, సందర్శకులకు వసతుల కల్పన, ఆహార పదార్థాలను అందుటాటులో పెట్టడం, పార్కిం గ్ నిర్వహణ వంటికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే కుడాకు భద్రకాళీ బండ్ నిర్వహణ కష్టం గా ఉంటున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని లుంబినీ పార్కు వంటి ముఖ్యమైన ప్రదేశాల తరహా లోనే భద్రకాళీ బండ్ నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని కుడా నిర్ణయించింది. ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 29న టెండరు తుది గడువుగా ఉన్నది. తొలిదశలో మూడేం డ్ల ప్రాతిపదికన ఈ టెండరు ఉంటుంది. భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చరల్ పార్కు నిర్వహణ టెండరు ప్రక్రియలో బండ్ ఆవరణలోని హార్టికల్చర్ పరిరక్షణ, లైటింగ్, ఫౌంటేన్లు, ఓపెన్ జిమ్లను ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలి.
బండ్ పై ఫుడ్ కోర్టు, వాహనాల పార్కింగ్ స్టాండ్ టెండరులో భాగంగానే ఉంటుంది. ఆన్లైన్ టెండర్లు పిలిచిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టెండర్లు వేసే అవకాశం ఉన్నది. భద్రకాళీ బండ్ నిర్వ హణ టెండరు ప్రక్రియలో కుడా పలు విధానాలను రూపొందించింది. బండ్ నిర్వహణకు ఎంపికయ్యే ఏజెన్సీ ప్రతి నెల కనీసం రూ.4 లక్షల 80 వేలు ఇవ్వా ల్సి ఉంటుందని టెండరులో పేర్కొన్నది. బండ్ నిర్వ హణకు టెండరు దాఖలు చేసిన సంస్థల మధ్య పోటీ ఆధారంగా ఈ మొత్తం పెరుగుతుంది. అత్యధిక మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్న ఏజెన్సీకి టెండరు దక్కుతుంది. వరంగల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న భద్రకాళీ బండ్ నిర్వహణ టెండరుకు పోటీ ఎక్కువగానే ఉండనున్నది. ఆహ్లాదకరంగా ఉండడంతో బండ్కు వచ్చే సందర్శకుల సంఖ్య ఎక్కు వగా ఉంటున్నది. ప్రస్తుతం కుడా ఆధ్వర్యంలోనే బండ్ నిర్వహణ సాగుతున్నది.
సాధారణ రోజుల్లో కనీసం 25 వేల మంది బండ్కు వస్తున్నారు. సెలవు రోజుల్లో టికెట్ల కలెక్షన్ సగటున రూ.7 లక్షలు ఉంటున్నది. బండ్పై ఫుడ్ కోర్టు, వాహనాల పార్కింగ్, పొటో షూట్ కలెక్షన్, సింథటిక్ ట్రాక్పై వాకింగ్ చేసే వారు చెల్లించే మొత్తం ఎక్కువ గానే ఉంటున్నది. భద్రకాళి బండ్ ఎంట్రెన్స్ టికెట్ పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20, బండ్పై ఫొటో షూట్కు రూ.5 వేలు, కెమెరాకు రూ.500, సింథటిక్ ట్రాక్పై వాకింగ్ కోసం నెలకు రూ.400, ఏడాదికి రూ.4 వేల చొప్పున వసూ లు చేస్తున్నారు. ఏడాదిగా కుడా అధ్వర్యంలో భద్రకాళీ బండ్ నిర్వహణ ఉండడంతో ఉచిత పార్కింగ్ వసతి ఉన్నది. టెండర్ ప్రక్రియ పూర్తయితే బండ్పై పార్కింగ్ కు రేట్ నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రకాళీ బండ్ నిర్వహణ టెండరుకు ఎక్కువ ఏజెన్సీలు పోటీ పడే అవకాశం ఉన్నది.
కొత్త అందాల బండ్…
చారిత్రక వరంగల్ నగరాన్ని పర్యాటకంగా అభి వృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి చెరువు చుట్టు భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చ రల్ పార్కు (భద్రకాళీ బండ్)ను చేపట్టింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తొలి దశలో భద్రకాళీ చెరువు వెంబడి ఒకటిన్నర కిలోమీటరు వరకు రూ.35 కోట్లతో బండ్ నిర్మాణం పూర్తయ్యింది. చేసి సందర్శకులను అబ్బురపరిచేలా అభివృద్ధి చేశారు. అందమైన పూల మొక్కలు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. ఒకటిన్నర కిలోమీటర్లు మేర కాకతీయ కళానైపుణ్యం ఉట్టిపడేలా ఆర్చీ గేట్లు, తీరొక్క లైట్లతో జిగేల్మనే ఫౌంటేన్లను నిర్మించారు. బండ్ పొడవునా ఏర్పాటు చేసిన సింథటిక్ వాకింగ్ ట్రాక్ ప్రత్యేకత ఆకర్షణగా ఉన్నది. బిజీ జీవితంలో ఉండే నగర ప్రజలకు భద్రకాళీ బండ్ ఆహ్లాద ప్రదేశంగా నిలిచింది. మొదటి దశలో పూర్తయిన భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చరల్ పార్కులను మున్సిపల్ మంత్రి కే తారకరామారావు గత ఏడాది ఏప్రిల్ 12న ప్రారంభించారు. అదే రోజు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. రెండో దశలో రూ.65 కోట్లతో రెండు కిలో మీటర్ల మేరకు బండ్ను నిర్మిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.