పోచమ్మమైదాన్, ఆగస్టు 16: భావితరాల్లో దేశభక్తిని నింపేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ మైదానంలో మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, జీఆర్పీలు, విద్యార్థులు మువ్వన్నెల జెండాలను చేతబూని సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మన జాతీయ జెండా ఎగురుతుంటే అందరి కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతున్నదన్నారు. దీని వెనుక ఎంతోమంతి త్యాగధనులు ఉన్నారన్నారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సీకేఎం కాలేజీ మైదానంలో ఒకేసారి మువ్వన్నెల జెండాలు ఎగురుతుంటే ఇక్కడ వెలకట్టలేని దేశభక్తి ఇమిడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. కలెక్టర్ బీ గోపి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి థియేటర్లలో గాంధీ చిత్రాన్ని వీక్షిస్తే ఆనాటి త్యాగధనుల వివరాలు తెలుస్తాయని తెలిపారు. బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్కుమార్, డీపీవో అర్చన, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, పలు సంస్థల ప్రతినిధులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరిసింగ్, శ్రీవత్స కోట, ఆర్డీవో మహేందర్జీ, డీపీవో స్వరూపారాణి, డీఆర్డీవో సంపత్రావు, జడ్పీ సీఈవో రాజారావు, తాసిల్దార్ సత్యపాల్రెడ్డి, కార్పొరేటర్లు కావటి కవిత, సురేశ్కుమార్ జోషి, బస్వరాజు కుమారస్వామి పాల్గొన్నారు. అలాగే, పోచమ్మమైదాన్ సెంటర్లో అందరూ కలిసి జాతీయ గీతాలాపన చేశారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్కుమార్, విద్యార్థులు, వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. కార్పొరేటర్ ఎండీ పుర్ఖాన్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద జాతీయ గీతం ఆలపించారు.
వేడుకలా జాతీయ గీతాలాపన..
వరంగల్ నగరవ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మంగళవారం వేడుకలా నిర్వహించారు. ఎంజీఎం ప్రధాన కూడలిలో మట్టెవాడ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంవోలు డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్, విభాగాధిపతులు, వైద్యులు, ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు జాతీయ గీతాన్ని ఆలపించారు. వరంగల్ సీకేఎం దవాఖానలో ఔట్పోస్టు పోలీసులు జాతీయ జెండాకు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం వైద్య సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. కేఎంసీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, సూపర్స్పెషాలిటీ దవాఖాన నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన నిర్వహించారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్కుమార్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ డీ రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ హేమంత్, డాక్టర్ రామానుజం, యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 36వ డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ ఎస్సై నాగరాజు పర్యవేక్షణలో వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో జాతీయ గీతాలాపన చేశారు.
28వ డివిజన్లో కార్పొరేటర్ గందె కల్పనానవీన్ ఆధ్వర్యంలో ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. 25వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్, 26వ డివిజన్లో బాలిన సురేశ్, 33వ డివిజన్లో ఎం అరుణాసుధాకర్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. 29వ డివిజన్ రామన్నపేట బొడ్రాయి వద్ద జరిగిన జాతీయ గీతాలాపనలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, నాయకులు పాల్గొన్నారు. 24వ డివిజన్ పాపయ్యపేట చమన్ స్వామి వివేకానంద విగ్రహం వద్ద కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి-శిరీష్ ఆధ్వర్యంలో మట్టెవాడ స్కూల్, ఇస్లామియా స్కూల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్, స్వామి వివేకానంద సేవా సమితి, టీఆర్ఎస్ నేతలు, పోలీసులు పాల్గొన్నారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని డివిజన్ల కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, అరుణ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టారు. చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, పాలకవర్గ సభ్యులు, వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు. కాశీబుగ్గ 19వ డివిజన్ ఓసిటీ మైదానంలో కార్పొరేటర్ ఓని స్వర్ణలత ఆధ్వర్యంలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. క్రీడాకారులు, కార్పొరేషన్ సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 18వ డివిజన్ తెలంగాణ జంక్షన్లో కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.