నర్సంపేట/కరీమాబాద్/పోచమ్మమైదాన్, ఆగస్టు 12: సీఎం కేసీఆర్ మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా నర్సంపేటలోని పాఠశాలలో సీఎం కేసీఆర్ చిత్రపటం ఏర్పాటు చేసి మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, సమసహాయం శ్రీదేవి, ఖాజాబీ పాల్గొన్నారు. కరీమాబాద్ 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. 40వ డివిజన్లో కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. టీఆర్ఎస్ 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
12వ డివిజన్ దేశాయిపేటలో కార్పొరేటర్ కావటి కవితారాజు యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పలువురు మహిళలు రాఖీలు కట్టారు. 13వ డివిజన్ కల్యాణ్నగర్లో టీఆర్ఎస్ 22వ డివిజన్ ఇన్చార్జి నాయకురాలు మావురపు గీతా విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో రాఖీలు కట్టారు. కార్యక్రమంలో రొయ్యల పావని, కలకోటి విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, మల్లీశ్వరి, మాధవి, పద్మ, సుకన్య, సునీత, సమ్మక్క పాల్గొన్నారు. 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు.
ముఖ్యమంత్రి చిత్రపటాలకు రాఖీలు కట్టి..
గిర్మాజీపేట/ఖిలావరంగల్/నర్సంపేటరూరల్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి వరంగల్ 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో మహిళలు, 25వ డివిజన్లో బాలిన సురేశ్ సమక్షంలో చిన్నారులు, వరంగల్చౌరస్తాలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో పారిశుధ్య మహిళా కార్మికులు రాఖీలు కట్టారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని మహిళలు అన్నారు. అలాగే, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు కుటుంబ సభ్యుల సమక్షంలో అతడి మనవరాళ్లు రాఖీలు కట్టారు. వరంగల్ మహానగరంలో ప్రతి ఇంట్లో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. 38వ డివిజన్ ఖిలావరంగల్ మధ్యకోటలో కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. అనంతరం కార్పొరేటర్ దంపతులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. శంభునిపేటలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలో రాఖీ వేడుకలు నిర్వహించారు.
సీపీవో జీవరత్నం ముఖ్య అతిథిగా హాజరై పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయనకు విద్యార్థినులు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ కే గిరికుమార్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని ముస్లిం మైనార్టీ గురుకులంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యార్థినులు, మహిళలు రాఖీలు కట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, దార్ల రమాదేవి, ఎం రాజు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ విద్యాసాగర్రెడ్డి, గుంటి కిషన్, టీచర్లు పాల్గొన్నారు.