హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రారంభమైన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు కొత్త ఊపిరి పోశారు. కోటయ్య మృతి పట్ల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.