మహబూబాబాద్, ఆగస్టు11 : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నా రు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడం 2 కే రన్ను ఆమె జెండా ఊపి ప్రారంభిం చారు. 75 అడుగుల జాతీయ పతాకంతో ఎన్టీఆర్ స్టేడియం నుంచి విద్యార్థులు, యువకులు, మంత్రి సత్యవతి, ఎంపీ కవిత, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు ర్యాలీగా ఫారెస్టు కార్యాలయం, అక్కడి నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నా రు. ఇందులో విజేతలుగా నిలిచిన 9 మందికి మెమెంటోలు అందజేశారు. నాటి మహనీయుల వేషధారణతో చిన్నారులు అలరించారు.
అనంతరం ఏర్పాటు సమావేశంలో మంత్రి సత్య వతి మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం గానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతుం దని, అది రూపుమాపాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తో ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనబడు తుందని ఆనందం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధిం చని విజయాలను నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాధించామని స్పష్టం చేశారు.
గాంధీజీ మార్గాన్ని భావితరాలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అడిషనల్ ఎస్పీ యోగేశ్గౌతమ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, ఆర్డీవో కొముర య్య, డీఎస్పీ పంతాటి సదయ్య, టౌన్ సీఐ సతీశ్, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, డీహెచ్ఎస్వో సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, తహసీల్దార్ నాగభవాని పాల్గొన్నారు.