నర్సంపేట, ఆగస్టు 11: గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్ మహిళలతో మాట్లాడి సూచనలు చేశారు. నర్సంపేట క్యాంపు కార్యాలయంలో పెద్ది వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని అనంతరం మాట్లాడారు. మంత్రి కేటీఆర్ సూచించినట్లు శుక్రవారం ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలు రాఖీలు కట్టాలని కోరారు. రాఖీలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రక్షాబంధన్ పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయమన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నర్సంపేటలోని డఫోడిల్స్ పాఠశాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి మహిళలు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకోవాలి
నర్సంపేటరూరల్: మహిళలు ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ కనెక్షన్లను వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఇటీవల ఆదర్శ మండల సమాఖ్య వార్షికోత్సవ మహాసభ, మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. అలాగే, ఇటీవల సమాఖ్య జాతీయస్థాయి అవార్డు పొందిన సందర్భంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఎల్పీజీతో పోల్చితే పీఎన్జీ గ్యాస్పై నెలకు రూ. 400 వరకు ఆదా చేసుకోవచ్చన్నారు. మహిళా సమైక్యలకు భవనాలను నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి గ్రామానికి రెండు చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఏపీడీ శ్రీనివాస్, ఏపీఎం కుందేళ్ల మహేందర్, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, వోఎంఎస్ అధ్యక్షురాలు మోటూరి శ్వేత, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.