దుగ్గొండి/నర్సంపేటరూరల్/నర్సంపేట/కరీమాబాద్/గిర్మాజీపేట: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం దుగ్గొండి మండలవ్యాప్తంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, తాసిల్దార్ సంపత్కుమార్, ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, ఎస్సై వంగల నవీన్కుమార్, ఎంపీవో శ్రీధర్గౌడ్, దుగ్గొండి సర్పంచ్ తోకల మంజులా నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మోర్తాల రాజు, ఊరటి మహిపాల్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. నర్సంపేట మండలం రామవరం జీపీలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఉప సర్పంచ్ జినుకల విమల, కార్యదర్శి నీలం విరీశ్కుమార్, వార్డు సభ్యులు జాతీయ జెండాలను ప్రదర్శించారు.
దాసరిపల్లిలో సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్, వార్డు సభ్యులు జెండాలను పంపిణీ చేశారు. గురిజాల లోలెవల్ వంతెన వద్ద గురిజాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. నర్సంపేట పట్టణంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా సంస్థల నిర్వాహకులు వజ్రోత్సవాల్లో పాల్గొంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీమాబాద్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్ల రవి ప్రజలకు జాతీయ జెండాలను అందజేశారు. డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, మాజీ కార్పొరేటర్ పల్లం రవి పాల్గొన్నారు. 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్లో కాలనీ కమిటీ అధ్యక్షుడు ఉల్ఫత్ ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు. బోగి సురేశ్, శ్రీకాం త్ పాల్గొన్నారు. కరీమాబాద్లోని న్యూ కౌటిల్య(ఎస్ఏ) ఉన్నత పాఠశాలలో 75 ఆకారంలో విద్యార్థులు కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. కరస్పాండెంట్ కోడం శ్రీధర్, ప్రిన్సిపాల్ కోడం సబిత, సిబ్బంది పాల్గొన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ డివిజన్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. తమ ఇండ్లపై జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 25వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
వినూత్న పద్ధతిలో వేడుకలు..
గీసుగొండ/సంగెం/పోచమ్మమైదాన్: వజ్రోత్సవాల్లో భాగంగా గీసుగొండ మండలం మచ్చాపురంలో వ్యవసాయ పొలంలో 75 స్వాతంత్య్ర వేడుకలను వ్యవసాయశాఖ అధికారులు ఆధ్వర్యంలో నాటు వేసే పద్ధతిలో వినూత్నంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య, కోఆప్షన్ మెంబర్ రహీం, ఏవో హరిప్రసాద్బాబు పాల్గొన్నారు. సంగెం మండలంలోని కాపులకనపర్తిలో డీఆర్డీవో సంపత్రావు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుతారి బాలకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సారంగపాణి, ఉప సర్పంచ్ ఎస్ సారగంపాణి, రవికుమార్, ఏపీఎం కిషన్, ప్రత్యేకాధికారి సురేశ్, కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎల్బీనగర్లో కార్పొరేటర్ సురేష్కుమార్ జోషి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ మసూం అలీ ఉన్నత పాఠశాలలో త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇంతెజార్గంజ్ సీఐ మల్లేశం, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ధరమ్సింగ్, నాయకులు పాల్గొన్నారు.