నర్సంపేట, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని, రాష్ట్ర సాధనకు నిరంతరం పోరాటం చేశారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నర్సంపేటలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ తొలి, మలి విడుత జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ప్రజలను ఏకం చేసి రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు. సీమాంధ్ర పాలకుల చేతిలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. నీళ్లు, నిధులు ఆంధ్రా ప్రాంతానికి తరలించారన్నారు. తెలంగాణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు.
సీఎం కేసీఆర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పని చేస్తున్నారని తెలిపారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణను సాకారం చేసేందుకు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. భారీ ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని పండుగలా చేశారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, రైతుబంధు సమితి రాష్ట్ర బాధ్యుడు రాయిడి రవీందర్రెడ్డి, ఆర్డీవో పవన్కుమార్, టీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్రెడ్డి, సొసైటీ చైర్మన్ మూరాల మోహన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మోతె జైపాల్రెడ్డి, బండి రమేశ్, పుల్లూరి స్వామిగౌడ్, సారంగపాణి, రావుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పెద్ది జన్మదిన వేడుకలు..
నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పెద్ది క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. పలువురు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆటా మహాసభల ప్రతినిధి బొద్డిరెడ్డి అనిల్ కేక్ కట్ చేసి తినిపించారు. మున్సిపల్ చైర్పర్సన్ గంటి రజినీకిషన్, పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.