వరంగల్, జూలై 19(నమస్తే తెలంగాణ) : జిల్లాలో 8వ విడుత హరితహారం జోరుగా సాగుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా జూలైలోనే వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారయంత్రాంగం ఉద్యమంలా నిర్వహిస్తున్నది. రహదారులపై అవెన్యూ, మల్టీలేర్, కమ్యూనిటీ ప్లాంటేషన్తో పాటు ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు అందిజేస్తున్నది. ఈ ఏడాది 25,92,224 మొక్కలు నాటాలని ఆయా శాఖలకు ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించగా ఇప్పటికే 16,06,265 నాటడం పూర్తయింది. ఇందులో మంగళవారం వరకు జిల్లాలోని 326 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలకు 6,65,148 మొక్కలు పంపిణీ చేసి పంచాయతీరాజ్ శాఖ మొదటి వరుసలో నిలిచింది. ఇప్పటికీ ఆరు, ఏడు శాఖలు మొక్కలు నాటడం మొదలుపెట్టకపోగా, మున్సిపాలిటీలు లక్ష్యసాధనలో వెనుకే ఉండగా త్వరలో 100శాతం పూర్తిచేసే దిశగా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జిల్లాలో ఎనిమిదో విడత తెలంగాణకు హరితహారం జోరుగా సాగుతున్నది. అధికారులు, ఉద్యోగులు హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంతోపాటు అవెన్యూ, మల్టీ లేర్, కమ్యూనిటీ, ఇనిస్ట్యూషనల్ ప్లాంటేషన్ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిర్దేశిత లక్ష్యంలో సుమారు 62శాతం మొక్కలు నాటారు. పచ్చదనం పెంపుకోసం ఈ ఏడాది జిల్లాలో హరితహారం ద్వారా 25,92,224 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు శాఖవారీగా టార్గెట్ ఖరారు చేసింది. పంచా యతీ శాఖకు 7,13,724, డీఆర్డీవోకు 5.85 లక్షలు, సెరికల్చర్కు 1.40 లక్షలు, వ్యవసాయ శాఖకు ఒక లక్ష, అటవీశాఖకు 50 వేలు, ఎక్సైజ్శాఖకు 1.33 లక్ష లు, ఉద్యానశాఖకు 75 వేలు, గనుల శాఖకు 8 వేలు, పశుసంవర్దకశాఖకు 38,400, విద్యా శాఖకు 52,200, పౌరసరఫరాలశాఖకు 5 వేలు, పరిశ్రమల శాఖకు 6 వేలు, మార్కెటింగ్శాఖకు 3 వేలు, సహకార శాఖకు 3 వేలు, మత్స్యశాఖకు 1,000, సంక్షేమశాఖ (ఐసీడీఎస్)కు 3 వేలు, మైనారిటీ సంక్షేమ శాఖకు 2 వేలు, గిరిజన సంక్షేమ శాఖకు 2 వేలు, బీసీ సంక్షేమ శాఖకు 1,500, ఎస్సీ వెల్ఫేర్ శాఖు 400, జీడబ్ల్యూ ఎంసీకి 5 లక్షలు, నర్సంపేట మున్సిపాలిటీకి 81 వేలు, వర్ధన్నపేట మున్సిపాలిటీకి 90 వేల మొక్కలు నాటాల ని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది వానకాలం జూలై నెలలోనే ఎడతెరి పి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడం, అధిక వర్ష పాతం నమోదు కావడంతో ప్రభుత్వశాఖల అధికారు లు, ఉద్యోగులు తెలంగాణకు హరితహారం కార్యక్రమా న్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. గడువుకు ముందు గానే లక్ష్యం మేరకు మొక్కలు నాటే దిశగా ముందుకు వెళ్తున్నారు. మంగళవారం వరకు దాదాపు 62శాతం అంటే 16,06,265 మొక్కలు నాటారు. కొన్ని ప్రభు త్వ శాఖల అధికారులు ఈ ఏడాది మొక్కలు నాట డంలో ఇప్పటికే తమ టార్గెట్ అధిగమించారు.
అగ్రభాగాన పంచాయతీ శాఖ
హరితహారం కార్యక్రమం అమల్లో పంచాయతీశాఖ జిల్లాలో అగ్రభాగాన ఉంది. మంగళవారం వరకు ఈ శాఖ జిల్లాలోని 326 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలకు 6,65,148 మొక్కలను అందజేసింది. ఇవ న్నీ ఆయా గ్రామ పంచాయతీ నర్సరీలో పెంచినవి. ఇంటింటికీ ఆరేసి మొక్కలను పంపిణీ చేసేందుకు పంచాయతీ శాఖ అధికారులు ముందుగానే గత నవం బర్లో ప్రతి గ్రామంలోని ఆయా కుటుంబం నుంచి ఇండెంట్ తీసుకున్నారు. ఈ మేరకు హరితహారం కా ర్యక్రమంలో భాగంగా కొద్దిరోజుల నుంచి ఇంటింటికీ ఆరేసి పండ్లు, పూల మొక్కలను అందజేస్తున్నారు. మండల పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు సర్పంచ్లు, పంచాయతీ ల పాలకవర్గం సహకారంతో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ కా ర్యక్రమంలో అమల్లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు సదరు సంస్థ అధికారులు, సిబ్బంది డీఆర్డీవో ఎం సంపత్రావు పర్యవేక్షణలో 3,28,909 మొక్కలు నాటారు. జీడ బ్ల్యూఎంసీ మూడో స్థానంలో ఉంది. మంగళవారం వ రకు జిల్లా పరిధిలో జీడబ్ల్యూఎంసీ 2,91,405 మొ క్కలు నాటినట్లు అధికారులు వెల్లడించారు. సెరికల్చర్ 1.51 లక్షలు మొక్కలు నాటింది. వ్యవసాయశాఖ 44,240, అటవీశాఖ 46,475, నర్సంపేట మున్సిపా లిటీ 7,960, వర్దన్నపేట మున్సిపాలిటీ 2,579, ఎక్సైజ్ శాఖ 5,700, ఉద్యానశాఖ 54,640, గనుల శాఖ 3,775, విద్యాశాఖ 285, పరిశ్రమలశాఖ 150, మత్స్యశాఖ 700, ఐసీడీఎస్ 3,71, గిరిజన సంక్షేమ శాఖ 228 మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఆరేడు శాఖలు ఇంకా మొక్కలు నాటడమే మొదలు పెట్టలేదు. మున్సిపాలిటీలు లక్ష్యసాధనలో వెనకబడి ఉండడం కూడా చర్చనీయమైంది.
మొక్కలు ఎక్కడెక్కడంటే..
హరితహారం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఈ సారి రహదారుల పక్కన అవెన్యూ, మల్టీ లేర్ ప్లాంటేష న్ కింద పెద్ద మొత్తంలో మొక్కలు నాటుతున్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద డంపింగ్యార్డులు, వై కుంఠ ధామాల వంటి ప్రదేశాల్లో మొక్కలు నాటిస్తున్నా రు. ఇన్స్టిటూషనల్ ప్లాంటేషన్ కింద ప్రభుత్వ విద్యా సంస్థల ఆవరణలో మొక్కలు నాటుతున్నారు. వీటితో పాటు పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనా లు, ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టూ 300 మొక్కలు నాటుతున్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు 67వ పుట్టిన రోజును పురస్కరించుకుని మండల పంచాయ తీ అధికారి కూచన ప్రకాశ్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో 67, లెంకాలపల్లి పల్లె ప్రకృతి వనంలో 67 మొక్కలు నాటారు. సాధ్యమైనంత త్వరలో 100 శాతం లక్ష్యాన్ని అధిగమించే దిశగా జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.