వరంగల్, జూలై 9 : చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజు శనివారం అమ్మవారు నీలా క్రమం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్ర పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారిని ఉదయం కాళీ క్రమం అనుసరించి ‘నీలా క్రమం’లో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.