ఎల్కతుర్తి, జూలై 5 : మండలంలోని ఇందిరానగర్లో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా కరీంనగర్ డెయిరీని ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఇది వరకు 70వేల సామర్థ్యం ఉన్న డెయిరీ ప్రస్తుతం లక్షా 50 లీటర్లకు విస్తరించిందన్నారు. హైదరాబాద్లో ఉన్న కోటి మంది జనాభాకు సరిపడా పాలను తెలంగాణ నుంచే సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డెయిరీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్కు ఇతర రాష్ర్టాల నుంచి పాలు సరఫరా అవుతున్నాయని, దీన్ని అధిగమించాలంటే రైతులు పాడి పరిశ్రమ వైపు దృష్టి సారిం చి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు.
డెయిరీల్లో కేవ లం పాల అమ్మకాలే కాకుండా స్వీట్లు, లస్సీ, బట్టర్ మిల్క్ తదితర వాటిని తయారు చేస్తున్నారని, తద్వారా వచ్చిన లాభాలను రైతులకే పంచుతారని పేర్కొన్నారు. రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం కోసం పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని సూచించారు. ‘యానిమల్ హాస్టల్స్’ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. దీంతో గ్రామాల్లో ఉండే పశువులన్ని ఒకే చోట ఉంచే అవకాశం ఉంటుందన్నారు. కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతుల ఇండ్లలో పెండ్లి జరిగితే పుస్తె, మట్టెలు అందజేయడమే కాకుండా ప్రమాదవశాత్తు పశువు మరణిస్తే మరో పశువును అందజేస్తున్నారని వివరించారు.
పాల ఉత్పత్తులను పెంచాలి :ఎమ్మెల్యే వొడితెల
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పాల ఉత్పత్తులను పెంచి ఆర్థికంగా బలపడాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. కరీంనగర్ డెయిరీ లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తుందని, అదనంగా 3 లక్షల లీటర్ల సేకరణ కోసం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పాల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, కావున రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆసక్తి చూపాలని సూచించారు.
ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మొదట డెయిరీ ఆవరణలో వినోద్కుమార్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, సర్పంచ్ కడారి రమాదేవి, ఎంపీటీసీ బొంకూరి రజిత, నాయకులు పిట్టల మహేందర్, మేకల కోమల, వెంకటేశ్యాదవ్, గుండా ప్రతాప్రెడ్డి, దేవేందర్రావు, సామల సురేశ్రెడ్డి, దుగ్యాని సమ్మయ్య, చెవుల కొమురయ్య, గొడిశాల వినయ్, వేముల సమ్మయ్య, రాజేశ్వర్రావు, బొంకూరి భద్రయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.