హనుమకొండ, జూలై 4 : కాకతీయుల వైభవాన్ని ప్రజలకు తెలియజేసేలా 7 రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నామని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తాహ వేడుకల వేదికలను గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
హనుమకొండలోని అంబేదర్ భవన్, హంటర్రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్, భద్రకాళి బండ్, భద్రకాళీ ఆలయం, ఆర్చి, వేయిస్తంభాల వాలయం, పద్మాక్షి కమాన్, సిద్దేశ్వర ఆలయం, పబ్లిక్ గార్డెన్, నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణాన్ని చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండలో కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కళాకారులు, రచయితలు తదితర కళారూపాలు, ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు వారి చరిత్ర, గొప్పదనం ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈమేరకు ప్రజలు మేధావులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయ మహారాజ్, పర్యటించే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు నిర్వహించాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వాసుచంద్ర, వరంగల్ ఏసీపీ గిరికుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఎంహెచ్వో రాజారెడ్డి ఉన్నారు.