ఖానాపురం, జూలై 4 : ప్రజాసమస్యలు చర్చించి పరిష్కరించడానికే మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అ న్నారు. సోమవారం ఎంపీపీ ఆధ్వర్యం లో మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొదటగా వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో ఏవో శ్రీనివాస్ మాట్లాడారు. వానకాలం పంటల సాగు ఆరంభమవుతున్నందున అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటలసాగుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు అం దిజేస్తామని ఆఖరు తేదీ ఈనెల 30 వర కు పొడిగించినట్లు తెలిపారు.
వెటర్నరీ శాఖ పై జరిగిన సమీక్షలో సిబ్బంది మాన స మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 10,003 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఐసీడీఎస్పై నిర్వహించిన సమీక్షలో సూపర్వైజర్ రమ మాట్లాడు తూ రాగంపేటలో అంగన్వాడీ టీచరు, వివిధ గ్రామాల్లో 16 అటెండర్ల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథపై జరిగిన సమీక్షలో ఏఈ సతీశ్ మా ట్లాడుతూ అన్ని గ్రామాలకు నీరు నిత్యం అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధం గా మండలంలోని అశోక్నగర్ సైనిక్స్కూల్, కస్తూర్బా, ఐనపల్లి జ్యోతిభాపూ లే, బుధరావుపేట మోడల్స్కూల్కు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామన్నారు.
కీర్యతండా సర్పంచ్ హఠ్య మా ట్లాడుతూ కీర్యతండాకు నీరు సక్రమంగా రావడంలేదన్నారు. విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఏఈ సంపత్ నివేదికను చదివి వినిపించారు. విద్యుత్ శాఖపై ఈనెల 10లోపు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి సిబ్బంది పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎంపీపీ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో ఏఈ మోహన్రావు మాట్లాడుతూ ఈ నెల 30లోపు శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సభకు అటవీ, నీటిపారుదల శాఖాధికారులు గైర్హాజరు కావడంతో వారిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ముం దుగా ఇటీవల సికింద్రాబాద్ పోలీ సు కా ల్పుల్లో మృతిచెందిన రాకేశ్కు స భ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జడ్పీటీసీ బత్తిని స్వప్న, ఎంపీడీవో సుమనవాణి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, డీటీ సృజన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.