భీమదేవరపల్లి/నర్సంపేట రూరల్, జూన్ :బహుభాషాకోవిదుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సం స్కరణల ఆద్యుడు మాజీ ప్రధాని దివంగత పాములపర్తి వెంకటనర్సింహారావు (పీవీ) 101వ జయంతి నేడు. దేశం ఆర్థిక సం క్షోభంలో ఉన్న సమయంలో పీవీ ప్రధాని అయ్యా రు. నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీకి అరుదైన గౌరవం ఇచ్చారు. పీవీ తెలంగాణ బిడ్డ కావడం మన అదృష్టమని ప్రకటించారు. పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మిణీదేవి-సీతారామరావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. కరీంనగర్ జిల్లా వంగరలో పెరిగారు. వరంగల్ జిల్లా వేలేరు ప్రభు త్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించారు.
హనుమకొం డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతో పాటు పీవీని అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. దీంతో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆయన ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. పీవీ బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి సీఎం బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంచెలంచెలుగా ఎదిగి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్ జిల్లాలో స్థాపించారు. 1946-1955 వరకు వారపత్రికను కొనసాగించారు. ఆత్మకథ ‘లోపలి మనిషి’లో భారతదేశ చరిత్ర, హైదరాబాద్ సంస్థానంలోని విశిష్టమైన అంశాలను, జరిగిన పరిణామాల గురించి ప్రచురించారు. ఆయనకు 17భాషల్లో ప్రావీణ్యం ఉంది. మరాఠీ నవలలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను హిందీలోకి అనువాదం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పీవీకి పేరుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖను పీవీపై గౌరవంతోనే ఏర్పాటు చేశారు. 1996లో ప్రధాని పదవీ కాలం ముగిశాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004 డిసెంబర్ 23న పరమపదించారు.
ఆయన అంత్యక్రియలకు ప్రాధాన్యం ఇవ్వడంలో నూ నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారు. ఇది తెలుగువాడిని అమితంగా కలచివేసింది. లక్నేపల్లిలో పీవీ మెమోరియల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. 2018 జూన్లో నాటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పీవీ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని ప్రారంభించారు. పీవీ కూతురు సురభివాణీదేవి ప్రత్యేక చొరవతో స్మారక చిహ్నంతోపాటు రూ.50లక్షల వ్యయంతో భవనం నిర్మించారు. గ్రామంలో పీవీ కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు. స్వగ్రామం వంగరలోని ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చి పీవీ ఉపయోగించిన వస్తువులు, రచించిన పుస్తకాలను పదిలపరిచారు.
లక్నేపల్లి, వంగరలో జయంత్యుత్సవాలు..
పీవీ జయంతి ఉత్సవాలు మంగళవారం నర్సంపేట మండ లం లక్నేపల్లి, భీమదేవరపల్లి మండలం వంగరలో జరుగనున్నాయి. పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త పీవీ మదన్మోహన్రావు తెలిపారు. లక్నేపల్లిలో ఎమ్మెల్యే వంగరలో ఎమ్మెల్యే వొడితల, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, పీవీ కూతురు సురభి వాణీదేవి, కుటుంబ సభ్యులు హాజరవుతారని వివరించారు.