మూగజీవాలకు మెరుగైన, తక్షణ వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 వాహనం సత్ఫలితాలనిస్తున్నది. ఒక్క ఫోన్ కొడితే కొద్ది సమయంలోనే ఇంటి ముందుకు వచ్చి వైద్య సేవలందిస్తున్నది. పశువైద్య సిబ్బంది, అంబులెన్స్తో సహా గ్రామానికి చేరుకొని మూగజీవాలను కాపాడుతుండడంతో రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇప్పటి వరకు ఈ వాహనం ద్వారా ములుగు జిల్లాలో దాదాపు 15 వేల పశువులకు చికిత్స అందించింది.
– ములుగుటౌన్, మే27
ములుగుటౌన్, మే27: మారుమూల పల్లెల్లోని జీవాలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని పశు వైద్యశాలలకు తరలించడం కష్టతరంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా 2016లో ‘1962’ పేరుతో వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక పశు వైద్యుడు, ఒక పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ఒక ఫోన్ కాల్ చేస్తే వీరు పల్లెలకు చేరుకుని ఇంటి వద్దనే వైద్యం అందిస్తారు. మూగజీవాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ల్యాట్ టెస్ట్లు చేసి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రాంతీయ పశువైద్యశాలలు, 15 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 16 పశు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా, ఒక మొబైల్ క్లినిక్ నిరంత రం సేవలు అందిస్తున్నాయి. సంచార వాహనం ద్వారా ఇప్పటివరకు దాదాపు 15 వేల జీవాలకు చికిత్స అందించారు.
1962కు ఫోన్ చేస్తే చాలు..
సంచార పశు వైద్య సేవలు పొందడానికి 1962 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటుచేసింది. రైతులు, పెంప కందారులు దీనికి ఫోన్ చేస్తే వారి ఇంటి వద్దకే వచ్చి పశువులకు వైద్య సేవలు అందిస్తారు. ఆపదలో ఉన్న వారు ఒక ఫోన్ కాల్ చేస్తే 108 అంబులెన్స్ ఎలా వస్తుందో.. అదేవిధంగా పశు వైద్యం కోసం ఈ వాహనం వచ్చి మూగ జీవాల ప్రాణాలు కాపాడుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం మూగజీవుల కోసం ప్రత్యేకంగా 1962 వాహనాన్ని అందుబాటులో ఉంచింది. టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేస్తే ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తారు. ఒకో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారామెడికల్ సిబ్బంది ఒకరు, డ్రైవర్ ఉంటారు. త్వరలో జిల్లాలోని ఏటూరునా గారం ప్రాంతీయ పశువైద్యశాలకు మరో వాహనం అందుబాటులోకి రానుంది. సంచార పశు వైద్య శాలలను రైతులు, పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి.