కాశీబుగ్గ, మే 27: ఆసియా ఖండంలోని అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, స్థానికులకు భద్రత కల్పించేందుకు సీఎం కేసీఆర్ పోలీస్స్టేషన్ మంజూరు చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం ఆయన సీపీ తరుణ్జోషితో కలిసి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని రైతు విశ్రాంతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనుమాములలో నూతనంగా పోలీస్స్టేషన్ ఏర్పాటు కోసం స్థలం, అనువైన భవనాన్ని పరిశీలించినట్లు తెలిపారు.
స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎనుమాముల, ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట ప్రాంత ప్రజలకు ఇక్కడ ఏర్పాటు చేయనున్న పోలీస్స్టేషన్ సేవలు అందుతాయని వివరించారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రోజూ వ్యాపారులు, వెయ్యి మంది కార్మికులు, రైతులు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందింతాయన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పోలీస్స్టేషన్ ఏర్పాటు కల త్వరలోనే నెరవేరనుందని తెలిపారు. కొద్ది రోజుల్లో హోంమంత్రితో పోలీస్స్టేషన్ను ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీపీ గిరికుమార్, మార్కెట్ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పాల్గొన్నారు.