ఖిలావరంగల్, మే 26 : మహానగర పాలకసంస్థలో విలీనం తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. దినదినాభివృద్ధితో విలీన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బొల్లికుంటలో నాలుగు కమ్యూనిటీ భవనాలకు రూ.1.80 కోట్లు కేటాయించారు. రూ.20లక్షలతో రైతు వేదిక భవనం, రూ.10లక్షలతో పశువైద్యశాల, రూ.50లక్షలతో మహిళా డ్వాక్రా భవనం, రూ.10లక్షలతో పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి శంకుస్థాపన చేశారు. పలు నిర్మాణాలు పూర్తికాగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. అలాగే, వసంతపురంలో రూ.1.68 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. రూ.35లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. డివిజన్లో అతి చిన్న గ్రామం స్తంభంపల్లి. ఈ గ్రామ అభివృద్ధికి రూ.2.20 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.కోటితో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు.
ధర్మారం రైల్వే గేటు నుంచి స్తంభంపల్లి వరకు బీటీ రోడ్డు పూర్తి చేశారు. రూ.22లక్షలతో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేశారు. విలీన గ్రామాల్లో మౌలలిక వసతుల కల్పనతో నగరాన్ని తలపింపజేసేలా భవనాలు వెలుస్తున్నాయి. దూపకుంటలో కమ్యూనిటీ భవనానికి రూ.15లక్షలు, మహిళా భవనానికి రూ.50లక్షలు కేటాయించారు. వసంతపురం, నక్కలపల్లి, తూర్పుకోట నుంచి దూపకుంటకు బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ధర్మారం నుంచి దూపకుంట మీదుగా కాపులకపర్తి వరకు డబుల్ రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. గాడిపల్లిలో కూడా అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. రెండు వీధులు మినహా ఊరంతా రూ.74లక్షల నిధులతో సీసీ రోడ్లు వేశారు. దూపకుంట నుంచి గాడిపల్లికి, వసంతపురం నుంచి గాడిపల్లి వరకు రూ.1.80కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అలాగే, రూ.1.20 కోట్లతో గుంటూరుపల్లి, నల్లకుంట నుంచి గాడిపల్లి వరకు రెండు బీటీ రోడ్లు నిర్మించారు. కార్పొరేటర్గా గద్దె బాబు ఎన్నికైన తర్వాత డివిజన్ అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ.9కోట్లు నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం..
– గద్దె బాబు, కార్పొరేటర్, 17వ డివిజన్
విలీన గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నాం. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం. గతేడాది బొల్లికుంటకు రూ.కోటి, సాయినగర్, ముస్కులపల్లి, రామకృష్ణపురానికి రూ.కోటి కేటాయించి అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించాం. గాడిపల్లిలో రూ.45లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.30లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధాన రహదారి కోసం రూ.1.45 కోట్లు మంజూరు చేశాం. గాడిపల్లి నుంచి వెంకటాపురం వరకు రహదారి నిర్మాణం కోసం రూ.50లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం దూపకుంటలో రూ.2.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వసంతపురం స్కూల్ నుంచి మంచినీళ్ల బావి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయించాం. ఆదర్శనగర్లో త్వరలోనే పనులన్నీ పూర్తికావస్తాయి.
టీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి..
– తరగల ప్రసాద్రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే విలీన గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కార్పొరేటర్ గద్దె బాబు సహకారంతో గ్రామస్తులందరం అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నాం. దూపకుంటలో కమ్యూనిటీ భవనం, మహిళా కమ్యూనిటీ భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం జరుగుతున్నది.