హనుమకొండ, మే 22 : టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్, జయశంకర్ సార్ జోడెడ్ల లాంటి వారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. హనుమకొండ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంతర్రెడ్డి చిల్లరగా మాట్లాడుతూ జోకర్లా మారాడన్నారు. జయశంకర్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. సీమాంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన సమైక్యవాది చంద్రబాబునాయుడు స్రిప్ట్లో పాత్రధారుడు, సూత్రధారుడు రేవంత్ రెడ్డి అని చీఫ్ విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ ఆలోచన విధానంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అంతేకాకుండా ఆయనను స్మరించుకోవడానికి ఓ విద్యాసంస్థ, జిల్లాకు పేరు పెట్టామని తెలిపారు.
జయశంకర్ సార్తో చివరి వరకు కేసీఆర్, ఉద్యమనాయకులు, గులాబీ సైనికులు మాత్రమే ఉన్నారు తప్ప ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు దరిదాపున కూడా లేరన్నారు. తెలంగాణ రైతుల గురించి మాట్లాడే హకు కాంగ్రెస్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసీఆర్ను కోరుకుంటున్నయి.. రాహుల్గాంధీ పీఎం అవుతాడని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం అవుతానని రేవంత్రెడ్డి పగటి కలలు కంటున్నాడన్నాడని ఎద్దేవా చేశారు. మరో 50 సంవత్సరాల వరకు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం వీరమణం పొందిన సైనికులు, రైతు ఉద్యమంలో అమరులైన వారిని ఆదుకుంటే కాంగ్రెస్, బీజేపీకి భయమెందుకు అని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే ముందుగా పార్టీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని వినయ్భాస్కర్ పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి ని ప్రజలు ఉరికిస్తరు : చల్లా
టీపీసీసీ అధ్యక్షుడు రౌడీ, బ్లాక్ మెయిలర్గా వ్యవహరిస్తున్నాడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. రచ్చబండ పేరుతో జయశంకర్ స్వగ్రామం అక్కంపేటకు వచ్చి అడ్డగోలు మాట్లాడారని ఆయన అన్నారు. రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ రచ్చగా మారిందన్నారు. రేవంత్రెడ్డి వెంట ఉన్న వారంతా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన రౌడీలు తప్ప స్థానికులెవరూ లేరన్నారు. రైతు డిక్లరేషన్ను 6 సంవత్సరాల క్రితమే సీఎం కేసీఆర్ అమలు చేశాడని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నాడు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని విరించారు. ఆపద్బంధు పథకం పేరుతో కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పెట్టారన్నారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతు ఏవిధంగా చనిపోయినా రైతు బీమా ద్వారా 10 రోజుల్లో కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల నుంచి రైతులు ఎందుకు తెలంగాణకు వస్తున్నారో రేవంతరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ గోటికి రేవంత్రెడ్డి సరిపోడని చల్లా పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ నాయకులే దూరవుతున్నారన్నారు. అక్కంపేటలోని గొర్రెలు కేసీఆర్ ఇచ్చినవేనని చెప్పారు. నువ్వు ఎక్కడ రచ్చబండ పెట్టినా అక్కడ రచ్చ రచ్చే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కొండగల్, మేడ్చల్కు తాను వస్తా.. అక్కడి జరిగిన అభివృద్ధి ఏంటో చూపించు.. లేదా నువ్వు పరకాల నియోజకవర్గంలోకి రా అక్కడ జరిగిన అభివృద్ధి చూపిస్తానని చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. పరకాల నియోజకవర్గానికి వస్తే ప్రజలు ఉరికించి కొడుతారని ఆయన హెచ్చరించారు. సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, వెంకన్న, రవీందర్, సాగర్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.