గిర్మాజీపేట, మే 21: నేత్ర వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ అన్నారు. చార్బౌళిలోని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శరత్ మాక్స్కేర్ విజన్ వారు శనివారం ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ సురేశ్ డీఎస్ టెంపుల్ చైర్మన్ ఉలకంటి సతీశ్, అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు మాలకుమ్మరి సత్యనారాయణ, కాపురపు సుధాకర్, వంచిత్ బహుజన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుట్టి రంజిత్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల అరుణ్కుమార్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ మహిళా సంఘం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మాలకుమ్మరి త్రివేణి, ప్రధాన కార్యదర్శి బందెల మాధవి, ఉపాధ్యక్షులు మాలకుమ్మరి స్రవంతి, దాసరి శారద, మాలకుమ్మరి లలిత, ఎడ్ల సరోజన, జోగు సృజన, పద్మ, సుజాత అంబేద్కర్ సంఘం నాయకులు మాలకుమ్మరి రవీందర్, గీసుగొండ మండల కన్వీనర్ కొత్త శివరాజు, శరత్ మ్యాక్స్కేర్ విజన్ దవాఖాన క్యాంపు కోఆర్డినేటర్ కేసారపు అనిల్, కౌన్సిలర్ కాసుల నవీన్, జంగం విద్య పాల్గొన్నారు.