సుబేదారి, మే 19: దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టు కున్నారు. ఈమేరకు గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరు ణ్జోషి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన గనిశెట్టి నగేశ్ రాజమండ్రికి చెందిన గొర్రెల మురళీ మోహన్ ఇద్దరు జల్సాలకు అల వాటుపడి దొంగ నోట్లు చలామణి చేస్తుండేవారు. అమా యక ప్రజలను టార్గెట్ చేసుకొని, అసలు డబ్బులు తీసు కొని వాటికి మూడింతలు రూ. 500 సైజు ఉన్న నల్ల కాగి తాలు ఇచ్చి మోసం చేసేవారు.
రెండు నెలల క్రితం హైద రాబాద్కు చెందిన మెడిచర్ల మోహన్ను పరిచయం చేసు కొని లక్ష అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తా మని చెప్పి వరంగల్ ఎంజీఎం దవాఖాన వద్దకు పిలి పించారు. బాధితుడు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందించగా, సీసీఎస్, మట్టెవాడ పోలీసులు ఎంజీఎం దవాఖాన వద్ద నిందితులు నగేశ్, మురళీమోహన్ను పట్టుకున్నారు. వారి నుంచి 100 నోట్ల నకిలీ కాగితాలు, టోనర్, నిమ్మరసం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చాటిన క్రైమ్, అపరేషన్స్ అడిషనల్ డీసీపీ పుష్ప, క్రైమ్ ఏసీపీ డేవిడ్రాజ్, సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందిని సీపీ అభినందించారు.