మంగపేట, మే 19 : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో వారం రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు దేవస్థాన ప్రాంగణంలోని కోనేరులో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా ఆదిలక్ష్మి-చెంచులక్ష్మి సహిత స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, పూజలు జరిపి, నూతన వస్ర్తాలతో అలంకరించారు.
అనంతరం పల్లకీలో మేళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణతో తీసుకొచ్చి కోనేటిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో పున రు ద్దరణ కమిటీ చైర్మన్ నూతిల కంటి ముకుందం, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకు డు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్శర్మ, కారంపూడి పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చందుశర్మ, సీతారాములు, సుధీర్ పాల్గొన్నారు.