గిర్మాజీపేట, మే 14: వరంగల్ నగరంలోని జేపీఎన్రోడ్డు, చౌరస్తాలో నూతనంగా ఏర్పాటైన అనంతుల కేదారి ఫ్యామిలీ షాపింగ్మాల్ను ‘డీజే టిల్లు’ ఫేం హీరో, హీరోయిన్లు జొన్నలగడ్డ సిద్ధు, నేహాశెట్టి శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో లభించే అన్నిరకాల వస్ర్తాలను నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు. అనంతుల కేదారి క్లాత్ మర్చంట్ నుంచి అనంతుల కేదారి షాపింగ్ మాల్ వరకు వస్త్ర ప్రపంచంలో ఏడు దశాబ్దాలకు పైగా విశేష అనుభవంతో ఓరుగల్లుకే ‘అనంత’ వైభవాన్ని తీసుకువచ్చేలా యజమానులు అనంతుల శ్రీనివాస్, అనంతుల గోపి, అనంతుల రవి, అనంతుల వేణు ఈ షాపింగ్మాల్ను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నితరాల కుటుంబ సభ్యులను అధునాతన అభిరుచులతో.. విస్తృతమైన వెరైటీలు, బెస్ట్ రేంజ్, కచ్చితమైన ధరలతో అందరికీ అనుగుణంగా తీర్చిదిద్దిన రిటేల్ అవుట్లెట్ అనంతుల కేదారి ఫ్యామిలీ షాపింగ్మాల్ అని తెలిపారు. నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ సరసమైన ధరలకే అందరికీ అందుబాటులో ఉండేలా చేసిన తమ ప్రయత్నానికి కేరాఫ్ అడ్రస్ అనంతుల కేదారి ఫ్యామిలీ షాపింగ్మాల్ అని పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్మసూద్, కార్పొరేటర్ గందె కల్పనా నవీన్, వరంగల్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ఎనుమాముల మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్షీ-కుమారస్వామి దంపతులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.