నెక్కొండ, మే 14: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణ, చిన్నకోర్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పెద్ది ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చేతులెత్తేసినా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రెండు పంటల సాగుకు పుష్కలంగా సాగునీరు అందిస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, పెట్టుబడి సాయం, అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు రైతబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు కొనియాడారు. రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీల చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, ఘంటా దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, చిన్నకోర్పోలు సర్పంచ్ కర్ర వెంకట్రెడ్డి, మార్కెట్ జిల్లా అధికారి ప్రసాదరావు, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సొసైటీ సీఈవో మోడెం సురేశ్, ఏఈవో వసంత పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నకోర్పోలులో ఇటీవల తాటిచెట్టు పైనుంచి జారిపడిన బత్తిని ఎల్లయ్య, గంగపురి రామును పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారు పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటానని బాధితుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నెక్కొండలో రెడ్లవాడ ఉప సర్పంచ్ వీరభద్రయ్య జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్ని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఈదునూరి రమేశ్ ఉన్నారు. అలాగే, దేవునితండాలో మహేశ్బాబు-మమత వివాహానికి హాజరై ఆశీర్వదించారు.
దండిగా ధాన్యపు సిరులు..
ఖిలావరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తూ చెరువులు, కుంటలను నింపుతుండడంతో భూగర్భ జలాలు పెరిగి దండిగా ధాన్యం పండుతున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ సోల్తి భూమాత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. సొసైటీ పరిధిలోని రైతులకు టోకన్లు ఇచ్చి వరుస క్రమంలో ధాన్యం తూకం వేసేలా చర్యలు తీసుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ తుమ్మ రవీందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పసునూరి స్వర్ణలత, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ తరగల ప్రసాద్, పీఏసీఎస్ డైరెక్టర్లు తోటకూరి నర్సయ్య, దొంతి వేమనరెడ్డి, బండి బాబురావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్, చంద్రమౌళి, సీఈవో మైదం కుమారస్వామి పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సంగెం/చెన్నారావుపేట: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి అన్నారు. సంగెం మండలంలోని గవిచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్నదాతలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దొనికెల రమా శ్రీనివాస్, ఏఈవో సాగర్, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, ఆర్బీఎస్ సభ్యుడు నందమూరి దయాకర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు ప్రారంభించారు. రైతులు టోకెన్ల పద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పరి లక్ష్మి, సీఈవో చిట్టె రవి, సెంటర్ ఇన్చార్జి మంచాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ మేడ వెంకటేశ్వర్లు, భూక్యా బాలుసింగ్, మండల కో ఆప్షన్ సభ్యులు దేవ్సింగ్, సంతోష్ సరస్వతి, సూరయ్య, ఏఈవో సుష్మిత, రైతులు రఘుపతి, కొమురయ్య, అశోక్, వీఆర్ఏ కాంతయ్య పాల్గొన్నారు.