స్థలం అందుబాటులో ఉంటే నూతన భవనం కోసం ప్రభుత్వ అనుమతితీసుకుంటాం : కలెక్టర్ గోపీ
పదో తరగతి విద్యార్థులతో మాటామంతీ
గిర్మాజీపేట, నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలల పరిశీలన
పోచమ్మమైదాన్, మే 13 : మన బస్తీ-మన బడి కార్యక్రమంలో చార్బౌళి ఉన్నత పాఠశాలను ఆధునీకరిస్తామని కలెక్టర్ బీ గోపి తెలిపారు. 21వ డివిజన్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నిర్మాణ పనులపై చర్చించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఖాళీ స్థలం అందుబాటులో ఉంటే నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. డివిజన్లో ప్రభుత్వ స్థలం కోసం సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులతో మాటామంతీ..
పాఠశాల పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలు ఉన్నా యా?, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని అడిగారు. అలాగే ఇంటర్లో ఏ కోర్సు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. విద్యార్థులందరూ 10/10 మార్కులు సాధించి, పాఠశాలకు పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు హాల్టికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, ఎంఈవో విజయ్కుమార్, తహసీల్దార్ సత్యపాల్రెడ్డి, కార్పొరేటర్ ఎండీ పుర్ఖాన్, ఎస్ఎంసీ చైర్మన్ ఎండీ అఫ్జల్, ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలా గే, కొత్తవాడ ఆటోనగర్లోని ప్రభుత్వ గిర్మాజీపేట ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. స్థలం అందుబాటులో ఉంటే డైనింగ్ హాల్, టాయ్లెట్స్ నిర్మిస్తామని తెలిపారు.
నరేంద్రనగర్ హైస్కూల్ను
పరిశీలించిన కలెక్టర్..
కాశీబుగ్గ : కాశీబుగ్గ ప్రాంతంలోని ప్రభుత్వ నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బీ గోపి పరిశీలించారు. మన బస్తి-మన బడి కార్యక్రమంలో బాగంగా పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంటగది, డైనింగ్ హాల్, టాయ్లెట్లు నిర్మించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థులకు హాల్టికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, ఏఈ శ్రీకాంత్, నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కుంట రవికుమార్, సిరినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోనగర్లోని గిర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. విద్యార్థులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని ఆయన తెలిపారు.