దుగ్గొండి, మే 12: టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. నాచినపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు దళారుల చేతిలో మోసపోకుండా సీఎం కేసీఆర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ. 1960, సీ గ్రేడ్కు రూ. 1940 ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.
అన్నదాతలు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమతారాజు నాచినపల్లి, చాపలబండ ఎంపీటీసీలు నగరబోయిన మమతామోహన్, పిండి కుమారస్వామి, నాచినపల్లి, మందపల్ల్లి పీఏసీఎస్ల చైర్మన్లు సుకినె రాజేశ్వర్రావు, గుడిపల్లి రాంరెడ్డి, ఏఈవో విశ్వశాంతి, వైస్ చైర్మన్ గుడిపల్లి ధర్మారెడ్డి, కొండం విజేందర్రెడ్డి, పీఏసీఎస్ సీఈవో రాజయ్య, డైరెక్టర్లు శ్యామ్సుందర్రెడ్డి, సంజీవరావు, పురుషోత్తం, ప్రభాకర్, సదానందం, బాబు, మేరుగు రాజు, జనార్దన్రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది సోమ ఓంకార్, చొప్పరి రజినీకుమార్, మద్దెల సుధాకర్, నాయకుడు రంగయ్య పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే సర్కారు లక్ష్యం
చెన్నారావుపేట/పర్వతగిరి: రైతు శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని జడ్పీటీసీ పత్తినాయక్ అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, జడ్పీటీసీ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, రైతుబంధు సమితి మండల ఓ ఆర్డినేటర్ బుర్రి తిరుపతి, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, టీఆర్ఎస్ యువజన నాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నాకు. అలాగే, పర్వతగిరి మండలంలోని రావూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కమలా పంతులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి సంతోష్గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, స్వామి, ఏపీఎం కృష్ణమూర్తి, జీపీ కార్యదర్శి గట్టికొప్పుల రాజు, ఉపసర్పంచ్ అమ్మీలాల్, గడ్డి యాకయ్య, ఎల్లాగౌడ్ పాల్గొన్నారు.