పోచమ్మమైదాన్, మే 12: దేశాయిపేటరోడ్డులోని టీచర్స్కాలనీ, గణేశ్నగర్లోని శ్రీఆదిమహాలక్ష్మి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 12వ పుష్కర బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు. 16న త్రిదండి చినజీయర్స్వామి రానున్నారు. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, మృత్సంగ గ్రహణం, అంకురారోపణం, రుత్విక్ వరణం, లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్టి, 17న సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్ర్తోత్ర పారాయణం, నిత్యహోమం, బలిహరణం, పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు బాలబోగం, రాత్రి 9 గంటలకు యాగశాల ప్రవేశం, ద్వారతోరణ పూజ, చతుస్థానార్చన, అగ్మి ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, ద్వజారరోహణం, బలిహరనం, బేరీపూజా, దేవతాహ్వానం, మంగళశాసనం, 18న ఉదయం 8 గంటలకు బాలబోగ నివేదిక, 9 గంటలకు యాగశాల నిత్యనిధి, ఆరాధన, మూలమంత్ర హవనం, సదస్యం, పూర్ణాహుతి, బలిహరణం, మంగళశాసనం, అమ్మవారికి సారె కార్యక్రమాలు, మధ్యాహ్నం 12 గంటలకు మహాఅన్నదానం, సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్ర్తోత్ర పారాయణం, నిత్య హోమం, బలిహరణం, పూర్ణాహుతి, 7 గంటలకు స్వామివారి ఊరేగింపు, 19న ఉదయం 8 గంటలకు బాలబోగ నివేదిక, నిత్యహోమం, 9 గంటలకు మహాపూర్ణాహుతి, ఉత్సవమూర్తులకు నవకలత స్నపనం, చక్రస్నానం, మంగళశాసనం, సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్ర్తోత్ర పారాయణం, స్వామివారి పుష్పయోగం, అశీర్వచనం, రుత్విక్ సన్మానం, ఉత్సవ పరిసమాప్తి, 20న ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్ర పునఃప్రతిష్ట, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
నూతన యాగశాల ప్రారంభం
పుష్కర బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నూతన యాగశాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీరంగం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాల ప్రవేశం జరిగింది. ఓడపెల్లి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఆయన సతీమణి ఓడపల్లి అనసూయ, కుమారులు, కోడళ్ల సమక్షంలో యాగశాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు కే విజయభాస్కర్రావు, అధ్యక్షుడు పీ రాంచందర్, విజయభాస్కర్డ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీరాములు, కోశాధికారి అప్పని కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి సీహెచ్ కవిత, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.