నర్సంపేట/నర్సంపేటరూరల్, మే 12: కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సుల వృత్తికి ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందికి గురువారం జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, నర్సులు ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేసి, బాధితులకు మందులు అందించి అనేక మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. వారి సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, నర్సంపేట సీఐ పులి రమేశ్, వైద్యుడు లెక్కల విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్, జడ్పీటీసీ కోమండ్ల జయమ్మ-గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, కౌన్సిలర్ బానాల ఇందిర, కొమ్ముల కరుణాకర్, గోనె యువరాజు, తడిగొప్పుల మల్లేశ్, డాక్టర్ నవత, డాక్టర్ భూపేశ్, నమిండ్ల సురేశ్, పైసా ప్రవీణ్, సునీత, రమ, రజిత పాల్గొన్నారు. అలాగే, క్యాంపు కార్యాలయంలో మండలంలోని భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మనోజ్లాల్, భూపేశ్, లెక్కల విద్యాసాగర్రెడ్డి, మోతె నవత, వైద్య సిబ్బందిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, జాగృతి జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్ పాల్గొన్నారు.
వైద్య వృత్తిలో నర్సులది కీలకపాత్ర
వరంగల్చౌరస్తా/కాశీబుగ్గ: వైద్య వృత్తిలో నర్సులది కీలకపాత్ర అని ఎంజీఎం నర్సింగ్ సూపరింటెండెంట్ ఏ రాధ అన్నారు. నర్సుల వృత్తికి ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని వరంగల్ ఎంజీఎం దవాఖానలోని నర్సింగ్ హాస్టల్ ఆవరణలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంజీఎం నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాధ హాజరై ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందేవారు, ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రులు, ప్రసూతి వైద్య సేవలకు వచ్చే గర్భిణులను తన తోబుట్టువులుగా భావించి సేవలందించే నర్సులు తల్లితో సమానమైన గౌరవాన్ని పొందుతున్నారని తెలిపారు. అచేతన స్థితిలో ఉన్న బాధితులకు సేవలు అందించే నర్సింగ్ వృత్తి పవిత్రమైనదన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్య సేవలు అందించి పునర్జన్మను ప్రసాదించే నర్సుల పాత్రం ఎంతో ముఖ్యమన్నారు. బాధితులకు వైద్యంతోపాటు మానవత్వం, ఆప్యాయతతో అందించే సేవలు సైతం ఔషధాలుగా పని చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఆర్ఎంవో డాక్టర్ మురళి, ఎంజీఎం నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు యాకమ్మ, కార్యదర్శి సుకన్య, స్వరూప, అరుణ, సరళ, సుభద్ర, రాగిణి, కమల, రమ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, వరంగల్లోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో జ్యోతిప్రజ్వల చేసి ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో దవాఖాన చైర్మన్ డాక్టర్ ఎన్ సామ్యేల్, నర్సింగ్ సూపర్వైజర్ మాధురి, వైద్యులు పోలా నటరాజ్, తౌటు భాస్కర్, శివకృష్ణ, భార్గవ్, ఉపేందర్, దీపక్ పాల్గొన్నారు.
నర్సులు, ఆశ వర్కర్లకు సన్మానం
నెక్కొండ/నల్లబెల్లి: దళిత సంఘాల ఆధ్వర్యంలో నెక్కొండ పీహెచ్సీ పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను ఘనంగా సన్మానించారు. దళిత సంఘాల ప్రతినిధి ఈదునూరి యాకయ్య, పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, అలంకానిపేట పీహెచ్సీ వైద్యాధికారి సుమంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, పీహెచ్ఎన్ అరుణ, దళిత సంఘాల నాయకులు ఈదునూరి రమేశ్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఈదునూరి యాకూబ్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ సంజీవ్, గారె శ్యామ్ప్రసాద్, క్రాంతి, రాజేశ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పరికి నవీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, జీపీ మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, ఎంపీటీసీ జన్ను జయరాజ్, బట్టు సాంబయ్య, ఎండీ నజీమా, సర్పంచ్ ఊరటి అమరేందర్రెడ్డి, ఓదెల విజయ, లక్ష్మి, పరికి కోర్నేల్, రత్నం, అడ్డ రాజు, రఘువర్ధన్ పాల్గొన్నారు.
ఎంజీఎంకు మూడు అవార్డులు
వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్నర్సులు ఏ యాకమ్మ, టీ ధనలక్ష్మితోపాటు స్టాఫ్నర్సు జే సుహాసినికి ఉత్తమ నర్సు అవార్డులు దక్కాయి. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ మెడికల్ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా వీరు అవార్డులు అందుకున్నారు. కరోనా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధితులకు సేవలు అందించిన నర్సుల సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. మొదటిసారిగా ఉత్తమ నర్సు అవార్డులను అందించింది. వీరిని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎంవో డాక్టర్ మురళి, పలువురు విభాగాధిపతులు, వైద్యులు అభినందించారు.