నర్సంపేట రూరల్, ఏప్రిల్ 6: రాష్ట్రంలోని ప్రజలకు రాజకీయాలకతీతంగా ప్రభుత్వ సాయం అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలం గుర్రాలగండిరాజపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరిజల నర్సయ్య భార్య రమ అనారోగ్యంతో బాధపడుతూ పలు ప్రైవేటు దవాఖానల్లో చేరి వైద్యం చేయించుకుంది. ఈ మేరకు ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.19 వేలు మంజూరు కాగా, బుధవారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో చెక్కు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందన్నారు.
ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని పెద్ది తెలిపారు. రాజకీయాలకతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికీ సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు బూస శ్రీశైలం, గాలి బాలరాజ్, తుత్తూరు వెంకటేశ్, అల్లి రవి, బండారి రమేశ్, తుత్తూరు రమేశ్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధి
నర్సంపేట: ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. వరంగల్ శివనగర్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఐజేయూ) బాధ్యతల స్వీకారోత్సవానికి పట్టణం నుంచి జర్నలిస్టులు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు గోపి, సత్యనారాయణ, శివానంద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.