రాయపర్తి, ఏప్రిల్ 4 : రాష్ట్ర రైతులు పండించి రెండు పంటల వడ్లను కొనేదాక కేంద్రంపై పోరు తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వడ్లను కొనేంత వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టమన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, జీపీ వాణిజ్య సముదాయాల ఆవరణలో నిర్వహించిన రైతు దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఎడ్లబండిపై ర్యాలీగా తరలి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ధాన్యం కొనుగోలులో రాష్ట్ర రైతులపై కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. పంజాబ్లో ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం కుంటి సాకులు చెబుతూ వెనుకంజ వేయడం ఏంటని, దేశంలో అన్ని ప్రాంతాలను సమానంగా చూడరా అని ప్రశ్నించారు. ఇక్కడి రైతాంగంపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
తొండి నేతలెక్కడ?
యాసంగి సాగు సమయంలో సీఎం కేసీఆర్ వరి పంట వేయొద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారని, కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇక్కడి రైతులు వడ్లే పండించాలని అడ్డగోలుగా మాట్లాడారన్నారు. ప్రతి గింజనూ కేంద్రంతో కొనుగోలు చే యించే బాధ్యత తమదంటూ ప్రగల్భాలు పలికిన వీరు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, కిషన్రెడ్డి గతంలో చేసిన ప్రసంగాలను ప్రజలకు వినిపించారు. పూట కో మాట, గంటకో వేశం మార్చే ప్రతిపక్ష నేతలు దద్దమ్మలని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రతో ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా మట్టిగొట్టుకు పోతుందన్నారు.
అనంతరం సర్పంచ్ గారె నర్సయ్య బహూకరించిన నాగలిని మంత్రి స్వీకరించి రైతుల్లో ఉత్సాహం నింపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండ ల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, ఎండీ నయీం, గబ్బెట బాబు, అయి త రాంచందర్, బిల్ల సుభాష్రెడ్డి, ఉల్లెంగుల నర్స య్య, మందాడి సుదర్శన్రెడ్డి, కోదాటి దయాకర్రావు, కుంచారపు హరినాథ్, లేతాకుల యాదవరెడ్డి, ఉండాడి సతీశ్కుమార్, మాలోత్ వసుందర్నాయక్, చిన్నాల రాజబాబు, గజవెల్లి ప్రసాద్, సత్యం, రాంచంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, రామస్వామి, చిట్యాల వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, శ్రీధ ర్, కుక్కల భాస్కర్, భూక్యా దీప్లానాయక్, అన్వర్, అశ్రఫ్పాషా, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, సత్తూరి నాగరాజు, గూడెల్లి తిర్మల్, గాజులపాటి నర్మద, గాదె హేమలత, లేతాకుల స్రవంతి, అమరావతి, సరికొండ నవల, పాలకుర్తి మయూరి తదితరులు పాల్గొన్నారు.