పాలకుర్తి రూరల్/దేవరుప్పుల, మార్చి 29: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, ఇందుకోసం బడ్జెట్లో రూ.7,300కోట్లు కేటాయించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా మంగళవారం పాలకుర్తి మండలం చెన్నూరు ఉన్నత పాఠశాలలో రూ.కోటి వ్యయంతో మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణానికి, దేవరుప్పుల మండలం ధర్మాపురం పాఠశాలలో రూ.30లక్షలతో చేపట్టిన కిచెన్ షెడ్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాఠశాలల్లో 12 రకాల వసతులకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాఠశాలల రూపురేఖలు మార్చడంతోపాటు విద్యారంగంలో పెనుమార్పులు చేపడుతామన్నారు. దేశంలోని మేధావులు, శాస్త్రవేత్తలు, ఉన్నతోద్యోగులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు పాఠశాలలో చిరస్థాయిగా నిలుస్తాయని, రూ.కోటి విరాళం ఇస్తే పాఠశాలకు వారి పేరు పెడుతారని అన్నా రు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో నియోజకవర్గంలోని పాఠశాలలకు బెంచీలను ఉచితంగా అందజేశామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను మంత్రి ఎర్రబెల్లి అడిగి తెలుసుకున్నారు. మీకు ఏం వసతులు కావాలని ఎర్రబెల్లి కోరగా ‘ సారూ.. మా పాఠశాలకు బస్సు కావాలని’ అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావుతో మా ట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. మ రో విద్యార్థి మాట్లాడుతూ సార్.. మా పాఠశాలలో మధ్యా హ్న భోజనం సరిగా లేదని చెప్పగా నిర్వాహకులను మార్చాలని ఎర్రబెల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మీ, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాస్రావు, కేలోత్ సత్తమ్మ, సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు, పుస్కూరి పార్వతీరాజేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మార్కె ట్ కమిటీ చైర్మన్ ముస్కు రాం బాబు, ప్రధానోపాధ్యాయుడు పో తుగంటి నర్సయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మ దార్, ఎంపీటీసీ పుస్కూరి కళింగరావు, కారుపోతుల వెంకటయ్య, పాము శ్రీనివాస్, కారుపోతుల వెంకట య్య, చంద్రయ్య, ఎండీ నాసర్, ఎండీ అబ్బాస్ పాల్గొన్నారు. దేవరుప్పుల మండలం ధర్మాపురంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ బజ్జూరి అశోక్, ప్రధానోపాధ్యాయుడు మూడిదె రాము, ఎంపీటీసీ లావుడ్యా ఉపేందర్, ఎస్ఎంసీ చైర్మన్ నూకల భారతమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతోజు కృష్ణమూర్తి, పీఏసీఎస్ డైరెక్టర్ ఇరుకుల్ల సతీశ్గుప్తా, మోర్సింగ్ పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం పాలకుర్తిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఉచిత కోచింగ్ సెంటర్ను తొర్రూరులో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం 81 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గతంలో ట్రస్టు ఆధ్వర్యంలో పాలకుర్తిలో కోచింగ్ ఇవ్వగా సుమారు 300 మంది వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈసారి సుమారు 1000 మంది ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాక్షించారు. టెట్కు కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పాలకుర్తిలో కోచింగ్ ఇస్తామన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కోచింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు భోజన వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ కోసం వచ్చే అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 7386616660, 9550032354 సెల్ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, పేరు వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు.