హనుమకొండ, మార్చి 28 : నగరం మరోసారి జా తీయస్థాయి మహోత్సవానికి వేదికైంది. కేంద్ర సాం స్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళ, బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలో రాష్ట్రీయ సంస్కృతి పేరుతో ఉత్సవాలు జరుగనున్నాయి. భారత దేశ సంప్రదాయం, సంస్కృతి, వారసత్వం, వైవిధ్యం, స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ర్టాల్లో వరంగల్కు మాత్ర మే తొలిసారి ఈ అవకాశం దక్కడం విశేషం. దేశ సం స్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు అన్ని కళలను మి ళితం చేస్తూ ఏడు జోన్లుగా విభజించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వెయ్యి మంది కళాకారులు పా ల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మెఘ్వాల్, మీనాక్షి లే ఖి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీలు పసునూరి దయాకర్, చీఫ్ వి ప్ దాస్యం వినయ్భాస్కర్, పలువురు ప్రముఖులు, అ ధికారులు పాల్గొంటారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాయం నుంచి అమరవీరుల స్థూపం వర కు సాంస్కృతిక మహోత్సవ ర్యాలీ నిర్వహించారు.
కళాకారుల రాక..
ఈ మహోత్సవాలకు హైదరాబాద్ బ్రదర్స్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, నేపథ్య గాయని మంగ్లీతోపాటు పలువురు కళాకారులు హాజరుకానున్నారు. ముగింపు రోజన వందేమాతరం శ్రీనివాస్ సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవానికి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ ఏర్పాట్లు చే సినట్లు వారు పేర్కొన్నారు.
ఏడు కల్చరల్ సెంటర్లు..
దేశ సంస్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు అన్ని కళలను మిళితం చేస్తూ ఏడు కల్చరల్ సెంటర్లను ఏర్పా టు చేశారు. ఇందులో నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ (పాటియాల), ఈస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (కోల్కతా), నార్త్ ఈస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (దిమ్మాపూర్), వెస్ట్ జోన్ కల్చరల్ సెంటర్ (అలహాబాద్), సౌత్ సెంట్రల్ జోన్ (నాగ్పూర్), సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ (తంజావూర్) ఉన్నాయి. ఒక సెంటర్ కింద నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలు ఉంటాయి. ఒక్కో కల్చరల్ జోన్లో ఐదు బృందాలు ఉంటాయి.
సంస్కృతి మహోత్సవ్ శోభాయాత్ర
హనుమకొండ చౌరస్తా : హనుమకొండ ఆర్ట్స్ అం డ్ సైన్స్ కళాశాల మైదానంలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే జాతీయ సంస్కృతి మహోత్సవంలో భాగంగా సోమవారం శోభాయాత్ర నిర్వహించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు బతుకమ్మలతో కళాకారుల డప్పుచప్పుళ్లు, మహి ళల కోలాటాలు, నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు.