కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంపుపై గురువారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ప్రజలతో కలిసి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని నిరసన తెలిపారు.
నర్సంపేట, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ గురువారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తరచూ వంట గ్యాస్ ధరలను పెంచడం సరికాదన్నారు. దీనివల్ల సామాన్యులపై పెనుభారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసిందని ధ్వజమెత్తారు. రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, నామాల సత్యనారాయణ, బత్తిని శ్రీనివాస్, ఎంపీపీ కళావతి, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, బానాల ఇందిర పాల్గొన్నారు.
కరీమాబాద్: పెట్రో, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ కరీమాబాద్లోని సుభాష్ విగ్రహం వద్ద మహిళా కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. గ్యాస్ ధర పెంపుతో సామాన్యులు వంట చేసుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ సర్కార్కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అలాగే, వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో పోశాల స్వామి, కలకోట్ల రమేశ్, ఈదుల రమేశ్, బొల్లం సంజీవ్, పద్మ పాల్గొన్నారు. అంతేకాకుండా గ్యాస్ ధరను నిరసిస్తూ తగ్గించాలని డిమాండ్ చేస్తూ 40వ డివిజన్లో కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఉర్సు చెట్లవారగడ్డ వద్ద టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బత్తిని వసుంధర, వొగిలిశెట్టి అనిల్, వనం కుమార్, కోరె కృష్ణ, వొగిలిశెట్టి సంజీవ్, బత్తిని అఖిల్, గుడిమెల్ల రాజు, వంగరి సురేశ్ పాల్గొన్నారు.
రాయపర్తి: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు గాజులపాటి నర్మద నేతృత్వంలో మండలకేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్యాస్ సిలిండర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడమే తప్ప బీజేపీకి ప్రజా సంక్షేమంపై ఎలాంటి శ్రద్ధ లేదని నర్సింహానాయక్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, పార్టీ నాయకులు పూస మధు, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, అయిత రాంచందర్, కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్రెడ్డి, భూక్యా క్రాంతి, కుక్కడపు జయశ్రీ, లేతాకుల యాదవరెడ్డి, ఎండీ ఉస్మాన్, దేదావత్ జగన్నాయక్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్/కాశీబుగ్గ: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ డిమాండ్ చేశారు. డివిజన్లోని గిరిప్రసాద్నగర్ ప్రధాన రహదారిపై గ్యాస్ సిలిండర్లతో రాస్తారోకో, ధర్నా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపి పేద ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకుమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, గిరిప్రసాద్నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, స్థానికులు పాల్గొన్నారు. కాశీబుగ్గ 18వ డివిజన్ ఎస్ఆర్టీకాలనీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాల్ల ఉమాదేవి, కుందారపు రాజేందర్, కార్యకర్తలు జక్కం ప్రవీణ్, రాయబారపు ప్రవీణ్, కొమ్ముల సుధాకర్, మర్రి చందర్, మల్లికార్జున్, దేవులపెల్లి భాగ్య, అనుముల సుజాత, గడ్డమీది రాజేశ్, ఈటల ఉమామహేందర్, సిలివేరు హెరాల్డ్ పాల్గొన్నారు. అలాగే, 19వ డివిజన్ గాంధీనగర్లో సీపీఐ మహిళా నాయకుల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు తాళ్లపల్లి రాహేలా, మేడిద పద్మ, కవిత, శ్రావణి, జ్యోతి, దివ్య పాల్గొన్నారు.