హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పౌరులు, వారి కుటుంబసభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార స్పష్టంచేశారు.
తెలంగాణకు చెందిన ఏ కుటుంబమైనా వారికి సంబంధించిన సమాచారం, కుటుంబసభ్యుల సమాచారం కావాలనుకుంటే తహసీల్దార్ ఆఫీస్, మీసేవ కేంద్రానికి వెళ్లి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందవచ్చని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ‘సర్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.