రాయపర్తి, ఫిబ్రవరి 27 : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 5ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మతాశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, జిల్లా వైద్యారోగ్యాశాఖాధికారి వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్వో గోపాల్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఆదివారం నర్సంపేటలో పల్స్పోలియో కార్యక్రమాన్ని హైస్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో అంతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైద్యాధికారి భూపేష్ తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : పోలియో రహిత సమాజాన్ని నిర్మించుకుందామని కలెక్టర్ గోపి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మొత్తం 546 కేంద్రాల్లో 70,931 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సబ్ సెంటర్లో నలుగురు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మండల వైద్యాధికారి మాధవీలత, కార్పొరేటర్ సుంకరి మనీషా, సీహెచ్వో మధుసూదన్రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.