ములుగుటౌన్, డిసెంబర్ 13 : ప్రణాళికతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లకు సూచించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్తో కలిసి వానకాలం వడ్ల కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్నారు. జిల్లాలో 1.20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైన మేర టార్పాలిన్లు, గన్నీ సంచులు, తేమ శాతం యంత్రాలు సిద్ధం చేయాలని పౌరసరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరుకు 8,977 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మారెట్కు ధాన్యం తీసుకొచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధాన్యం నాణ్యత, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని న్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టీ అరవింద్రెడ్డి, డీఎం రాములు, మిల్లర్ల అసోసియేషన్, కార్యదర్శులు, అధ్యక్షులు సతీశ్కుమార్, వాసుదేవరెడ్డి, విజేందర్ పాల్గొన్నారు.