గిర్మాజీపేట, డిసెంబర్ 11: వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని కార్పొరేటర్ బస్వరాజు శిరీష అన్నారు. 25వ డివిజన్ నిజాంపుర కాలనీలోని డైమండ్ ఫంక్షన్ హాల్లో హనుమకొండలోని బాలాజీ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం వైద్యురాలు పొన్నాల నీరజ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిట్స్, పక్షవాతం, మెడనొప్పి, తలనొప్పి, డిస్క్ సమస్యలు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ నాయకులు జన్ను శ్యామ్, ఎండీ మతిన్, జన్ను కరుణాకర్, జన్ను రవి, జన్ను అనిల్, జన్ను సురేశ్ పాల్గొన్నారు.
అలాగే, 33వ డివిజన్లోని పోచమ్మ ఆలయ ఆవరణలో ప్రముఖ దంత వైద్య నిపుణుడు వన్నాల వెంకటరమణ ఆధ్వర్యంలో సఫల్ భారత్ ఫౌండేషన్ న్యూఢిల్లీ, సమాఖ్య ఫౌండేషన్ సమక్షంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హనుమకొండలోని శ్రీలక్ష్మీనర్సింహ దవాఖాన వైద్యురాలు సంధ్యారాణి బృందం, హిత డెంటల్ క్లినిక్ డాక్టర్ వికాస్, డాక్టర్ స్నిగ్ధ రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ వన్నాల వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శారద, శ్యామ్సుందర్, ఆడెపు వెంకటేశ్, భవానీశంకర్, మాదాసు రాజు పాల్గొన్నారు.