దుగ్గొండి, డిసెంబర్ 11 : క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజీజ్ఖాన్ అన్నారు. ఆదివారం మండలంలోని నాచినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో హనుమకొండ, వరంగల్ జిల్లా స్థాయి కాకతీయ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల మమత, ఎంపీటీసీ నగరబోయిన మమత, ఉపసర్పంచ్ జంగా రాజిరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సారంగపాణి, ఎన్నారై రాజ్కుమార్, సీఐ జక్కుల శ్యాం, క్రీడల నిర్వాహకుడు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, సెక్రటరీ అబ్దుల్లా ఖాన్, మల్లికార్జున్, పుప్పాల ఎల్లయ్య, చెన్నూరి కిరణ్రెడ్డి, అండృ రత్నాకర్రెడ్డి, నర్ర రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.