హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 11 : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం హనుమకొండలో సుంకురుశెట్టి ప్రియాంక ఆదివారం 24 గంటల నిరంతర స్పీచ్ ‘సన్ రైజ్ టు సన్ రైజ్’ ప్రారంభించారు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ అడ్వైజర్ టీవీ అశోక్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సూర్యాపేటకు చెందిన బుచ్చయ్య-నిర్మల రెండో కూతురు ప్రియాంక వాగ్దేవి కళాశాలలో బీఫార్మసీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫార్మసీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఓ ఫార్మా కంపెనీలో లీడ్ సీడీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం క్లినికల్ రీసెర్చ్, డాటా మేనేజ్మెంట్పై 24 గంటల నిర్విరామ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా అతిథులు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్, బొమ్మినేని కృష్ణవేణి, చంద్రశేఖర్రెడ్డి, వనపర్తి పద్మావతి, విద్యార్థులు, తల్లిదండ్రులు, విషయ నిపుణులు సుధామానస, జానకి, నూతన, దిలీప్రెడ్డి, సుమలత, సత్యం తదితరులు పాల్గొన్నారు.