ములుగు టౌన్, 10: రెండు వారాల్లో క్రిస్మస్ పండుగ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. నిరుపేదలు కూడా సంబురంగా పండుగ జరుపుకునేందుకు ఏటా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి సుమారు వెయ్యి గిఫ్ట్ ప్యాక్లు జిల్లాకు చేరగా తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచారు. త్వరలోనే అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసి, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలోపంపిణీ చేయనున్నారు. ఈస్ట్ ఫెస్ట్ పేరుతో విందు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షలను మంజూరు చేసింది.
అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కానుకలు అందిస్తోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉన్నందున క్రైస్తవులకు అందించే కానుకలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో సుమారు వెయ్యి మంది నిరుపేద క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు ఈస్ట్ ఫెస్ట్ నిర్వహణకు నియోజకవర్గానికి రూ.2లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
నిరుపేదలు
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఏటా హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు, రంజాన్కు ముస్లింలకు, క్రిస్మస్కు క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు దుస్తుల కిట్ల పంపిణీతోపాటు విందులు ఇచ్చేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులుగా అర్హులను చేయనున్నారు. ఒక్కో కిట్లో చీర, ప్యాంట్, షర్ట్, పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి. తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను భద్రపరచగా తహసీల్దార్ సత్యనారాయణస్వామి పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి ఆయా తహసీల్దార్ల వద్దకు చేరాక అర్హులైన క్రిస్టియన్లకు పంపిణీ చేస్తారు. స్థానిక పాస్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందజేస్తారు.
త్వరలోనే గిఫ్ట్ ప్యాక్ల పింపిణీ
ములుగు నియోజకవర్గానికి వెయ్యి క్రిస్మస్ గిఫ్ట్ప్యాక్లు వచ్చాయి. తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. త్వరలోనే పంపిణీ చేస్తాం. నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు ఈస్ట్ వెస్ట్ విందు ఏర్పాటుకు జిల్లాకు రూ.2లక్షలు మంజూరయ్యాయి.
– ఎన్.జశ్రన్కుమార్,జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, ములుగు